జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 1 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయా శాఖల వారీగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని ఉదయం 9.45 నిమిషములకు గంటలకు ప్రగతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాక ఆవిష్కరణ పోలీసుల గౌరవ వందనం ఉంటుందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభబింభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అన్నారు. అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరావు జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో అమలు చేసిన, చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై శకటాలను ప్రదర్శించబడతాయి అని తెలిపారు. అన్ని శాఖలు ఆ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.సాయంత్రం నాలుగు గంటలకు ఐదు నియోజకవర్గాలలో తెలంగాణ సాంప్రదయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిపై సందేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా నిర్వహించాలి.
జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతీ మండలంలో నిర్వహించే సదస్సులపై రెండు రోజుల ముందుగా ఆయా గ్రామాలకు సమాచారం ఇవ్వాలని, అప్లికేషన్ తో పాటు ఇవ్వాల్సిన పత్రాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సులు నిర్వహించాలని తెలిపారు. సదస్సులు నిర్వహించే చోట హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, అప్లికేషన్ ఫారాలు ఇతర కావాల్సిన సామగ్రిని అందుబాటులో ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అప్లికేషన్ పూర్తిగా పక్కా సమాచారంతో నింపాలని తెలిపారు.ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షించాలని స్పష్టం చేశారు. భూములకు సంబంధించి వచ్చే అప్లికేషన్ వివరాలు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి దానిలో నమోదు చేయాలని పేర్కొన్నారు. అప్లికేషన్ లు ప్రతి అంశం చక్కగా రాయాలని అప్లికేషన్ స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారులకు రిసీవ్డ్ కాఫీ అందజేయాలని, వారి కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియమించి రాయించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసే సదస్సులను విజయవంతం చేయాలని సూచించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి*
