*క్రీడా పాఠశాలల జిల్లాస్థాయి ఎంపికలు పూర్తి*
*రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 25
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం క్రీడా పాఠశాలల జిల్లాస్థాయి ఎంపికలు ఘనంగా నిర్వహించారు. మండల స్థాయి నుండి ఎంపికైన బాలబాలికల కోసం నిర్వహించిన ఈ ఎంపికల్లో మొత్తం 55 మంది విద్యార్థులు వివిధ క్రీడా పరీక్షల్లో పోటీ పడ్డారు.
ఈ ఎంపికల్లో భాగంగా విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్టర్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసన్ బాల్ త్రో, 800 మీటర్ల పరుగు, పట్టికల్ జంప్, 6 x 10 మీటర్ల షటిల్ పరుగు, మెడికల్ టెస్ట్ వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులను వచ్చే నెల జూలై 3, 4 తేదీలలో (03.07.2025, 04.07.2025) నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తెలిపారు.
ఈ ఎంపికలు విద్యార్థుల్లో క్రీడాపట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడానికీ మదుపు అవుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.