Site icon PRASHNA AYUDHAM

ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం – ఎమ్మెల్యే మదన్ మోహన్

IMG 20251025 210331

🔹 ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం – ఎమ్మెల్యే మదన్ మోహన్ 🔹

గాంధారి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పీఏసీఎస్ గోదాంలు ప్రారంభం

హేమ్లా నాయక్ తండాలో జీపీ భవనానికి భూమిపూజ

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని వ్యాఖ్య

ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు

గాంధారి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండల పరిధిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హేమ్లా నాయక్ తండాలో గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేసి, పోతంగల్ కలాన్‌, పిస్కులు గుట్ట, చద్మల్‌, సర్వాపూర్‌ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అలాగే ఎక్కకుంట తండాలో అంగన్వాడీ భవనానికి, పేట్ సంగెం, గుర్జాల్ గ్రామాల్లో పీఏసీఎస్ గోదాంలకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ — “గతంలో ఎప్పుడూ లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు చేరవేయడమే మా ప్రధాన ధ్యేయం” అన్నారు.

కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version