Site icon PRASHNA AYUDHAM

సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పక్కగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్..

సర్వే
Headlines in Telugu:

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రతీ ఇంటింటి సర్వే చేపట్టాలని, ఏ ఒక్క ఇల్లు కూడా తప్పి పోకుండా సర్వే చేయాలని అన్నారు. సర్వే కోసం ఎన్యుమారేటర్ లను నియమించాలని, వారికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఎన్యుమరెటర్లకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు జారీచేయాలని సూచించారు. ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి లోని అన్ని అంశములకు సంబంధించిన వివరాలు ఎన్యుమారెటర్లు సేకరించాలని తెలిపారు. ప్రతీ ఎన్యుమారెటర్ కు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మండల ప్రతేక అధికారులు ఎన్యుమరేషన్ పై పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఏన్యుమరేషన్ కు అవసరమైన సామాగ్రి సమకూర్చాలని తెలిపారు. మండల స్థాయిల్లో ఏన్యుమారెటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వేను పకడ్బందీగా, పక్కగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సి. పి. ఒ. రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version