రాజీ మార్గమే.. రాజ మార్గం: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాజీ మార్గమే.. రాజ మార్గం అని, రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చుని, సైబర్ నేరాలలో హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు అందే విధంగా చూడాలని, మార్చి 8న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అన్ని కేసులలో ఇరువర్గాలు రాజీపడేలా వారికి అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఓలకు సూచనలు చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన/ హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు చేరే విధంగా సంబంధిత బ్యాంక్ అధికారులకు కోర్టు ద్వారా ఉత్తర్వులు అందించాలని సూచించారు. ఇ-పెట్టి కేసులు మరియు మద్యం తాగి పట్టుబకడిన కేసులలో ఫైన్ అమౌంట్ చెల్లించే విధంగా చూడాలని అన్నారు. కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీ కుదుర్చకోవాలని ఎస్పీ రూపేష్ సూచించారు. ఈ కాన్ఫరెన్స్ నందు అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now