మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మందికిపైగా మావోయిస్టులను హత్య చేయడాన్ని ఖండించండి.
– సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మందికిపైగా మావోయిస్టులను హత్య చేయడాన్ని మానవతావాదులు ప్రతి ఒక్కరు ఖండించాలని సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా మధ్యభారత అడవుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో హత్యాకాండను కొనసాగిస్తున్నది. నిన్న 21/05/2025న చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మాడ్లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ తో పాటు 27 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరిందన్నారు.ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలనీ మేధావులు, ప్రజాస్వామికవాదులు మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు.అయినా నరేంద్ర మోడీ, అమిత్ షా బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పైగా మధ్యభారతంలో నరమేధాన్ని తీవ్రతరం చేస్తుందన్నారు.రోజు ఈ దేశ పౌరులను మావోయిస్టుల పేరుతో హత్య చేస్తూ పోతుందనీ, అడవుల నుండి మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీలను ఖాళీ చేయించి అడవి సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందన్నారు.ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి పారామిలిటరీ బలగాలను వెనుకకు రప్పించాలనీ ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించాలనీ, నిన్న బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, మిగతా మావోయిస్టు పార్టీ సభ్యులకు సిపిఎo పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ విప్లవ జోహార్లు ప్రకటిస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ నరమేధాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరుతున్నాం అన్నారు.
జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులువెంకట్ గౌడ్, మోతిరామ్ నాయక్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.