Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు సీఎం ప్రజావాణి పిటిషన్ల పరిష్కారంలో తెలంగాణ డీజీపీకి అభినందనలు.*

IMG 20250627 WA0316 1

•కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు సీఎం ప్రజావాణి పిటిషన్ల పరిష్కారంలో తెలంగాణ డీజీపీకి అభినందనలు.*

 

*• జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంఅదునకున్న అదనపు ఎస్పి.*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 27

 

సీఎం ప్రజావాణి పిటిషన్ల పరిష్కారంలో, కామారెడ్డి జిల్లా దరఖాస్తులు అందిన వెంటనే విచారణ చేసి రిపోర్ట్ లు పంపడం జరిగింది. డీజీపీ కార్యాలయము నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన జిల్లా నుండి ఒక్కటి కూడా పెండింగ్ లో, లేకుండా సమర్థవంతంగా పరిష్కరించడం, ద్వారా జిల్లా పోలీస్ శాఖకు, మంచి గుర్తింపు వచ్చింది. సందర్భంగా డీజీపీ డాక్టర్ జితేందర్, ఐపీఎస్ జిల్లా నోడల్ అధికారి అయిన అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డికి ప్రశంసా పత్రం, ద్వారా అభినందించడం జరిగింది.

ప్రజావాణి పిటిషన్లను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పోలీస్ శాఖ తన ప్రతిబద్ధతను మరోసారి నిరూపించింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కే. నరసింహారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వేగంగా, నిష్పాక్షికంగా పరిష్కరించడం ద్వారా పోలీస్ విభాగంపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరచడమే మా లక్ష్యం. ఈ విజయానికి కృషి చేసిన అన్ని స్థాయి పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర, అభినందనలు తెలియజేసినారు.

Exit mobile version