అదానీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదానీ-సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ వైఖరిని ఆయన ప్రశ్నించారు. దిల్లీలో పోరాటమంటూ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అదానీకి అప్పగిస్తున్న రేవంత్ను ఆపే శక్తి రాహుల్గాంధీకి ఉందా? అని నిలదీశారు.