*జంఝావతి కాలువను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 9 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
పార్వతీపురం:
ఖరీఫ్ కి ముందే సాగునీటి కాలువలు క్లీన్ చేయాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పార్వతీపురం మండలం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ తదితరులు పార్వతీపురం పట్టణ సమీపంలోని కొత్తవలస- గోపాలపురం గ్రామాల మధ్య ఉన్న జంఝావతి కాలువను పరిశీలించారు. కాలువ మొత్తం పూడికలతో నిండిపోయి, పిచ్చి మొక్కలు, తుప్పలు, డొంకలు, గుర్రపు డెక్కలు తదితర వాటితో కాలు కనిపించే పరిస్థితి లేకపోవటం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తే గత కొన్ని ఏళ్లుగా కాలువ క్లీన్ చేసే పరిస్థితి లేనట్లుందన్నారు. పూర్తిగా జంగిల్ తో నిండిపోయిన కాలువలో నీరు ఎలా ప్రవహిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే కాలువను క్లీన్ చేసే పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, సంబంధిత శాఖ చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ప్రతి ఏటా రైతులు కాలు నీరు పొలాలకు అందటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా చివారు పొలాలకు నీరు అందుకు పోవటానికి కాలువల్లో పూడిక తీత పనులు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టక పోవటమే అన్నారు. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాలు ప్రారంభమైతే కాలువల్లో పూడిక తీత పనులు ఏ విధంగా చేపడతారన్నారు. జంఝావతి కాలువతోపాటు తోటపల్లి కుడి, ఎడమ ( బ్రిటిష్ కట్టడాలు ) కాలువలు, వెంగళరాయ కాలువలు ( సీతానగరం మండలంలో ), పెదంకలాం అక్విడేట్ కాలువలు, రావాడ గెడ్డ కాలువలు తదితర కాలువల్లో పూడుకు తీత పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు, కాలువల్లో గండ్లు పూడ్చే పనులు, షట్టర్లు ఏర్పాటు, మరమ్మత్తులు చేపట్టే పనులు తక్షణమే చేపట్టాలన్నారు. వేసవిలోనే నైరుతి రుతుపవనాలు రాకముందే అవసరమైన పనులు చేపట్టి సాగునీటి కాలువల్లో నీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా జోరుగా ప్రవహించి ఆఖరి పొలానికి కూడా నీరు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.