టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 14 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే టియుసిఐ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేయడానికి పూనుకున్నదని, దానిలో భాగంగానే ముందు తరాల కార్మిక వర్గం పోరాడి , రక్త తర్పణ చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది అన్నారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, ఎనిమిది గంటల పని దినం లాంటి తదితర హక్కులను కాలరాయడానికి పూనుకున్నది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్యంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడుల రద్దుకై పోరాడవలసిన అవసరం ఉందన్నారు. బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించడం కోసం గత కార్యక్రమాలను, పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను, పోరాటాలను రూపొందించుకొనుటకు ఈనెల 16న కొత్తగూడెం ఉర్దూగర్ లో టి యు సి ఐ జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా మహాసభలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.
ఈ సమావేశంలో బత్తుల. వెంకటేశ్వర్లు, మిట్టపల్లి. రాజేందర్, నరసింహారావు, లక్ష్మీనారాయణ, దుర్గయ్య, భరత్, వెంకటేశ్వర్లు, రాఘవులు, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 16న కొత్తగూడెంలో జరిగే టి యు సి ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయండి*
by Naddi Sai
Published On: February 14, 2025 9:58 pm
