*నిబంధనలకు విరుద్ధంగా రెండో అంతస్తు నిర్మాణం*
*చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు*
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
*కొత్తగూడెం*: పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా 30వ వార్డు మథుర బస్తీలో అనుమతులకు విరుద్ధంగా సెట్ బాక్స్ నిభంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేపడుతున్న స్థల యజమానిపై చర్యలు తీసుకోవాలని అదేవిదంగా అట్టి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మాణం చేపడుతున్న విషయంపై బీఎస్పీ ఆధ్వర్యంలో 5 నెలలుగా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తూతూమంత్రంగా నోటీసులు జారీ చేయడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో ఆ నిర్మాణం రెండో అంతస్తు వరకు చేరుకుందని పేర్కొన్నారు.జాతీయ రహదారిపై ఇసుక,కంకర పోసి పాదచారులు,వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇది సరైంది కాదన్నారు.జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బస్టాండ్ ఎదురుగా జరుగుతున్న నిర్మాణంపై మున్సిపల్ అధికారుల వ్యవహారశైలిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు.
ఈకార్యక్రమంలో *జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,శంకర్,మురళి* తదితరులు పాల్గొన్నారు