Site icon PRASHNA AYUDHAM

ఈస్ట్ సాయి.నగర్ లో సీసీ రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ 

IMG 20250624 WA1151

ఈస్ట్ సాయి.నగర్ లో సీసీ రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ప్రశ్న ఆయుధం జూన్ 24: కూకట్‌పల్లి ప్రతినిధి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి.నగర్ లో 16 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈస్ట్ సాయి నగర్ లోని రోడ్డు నెంబర్ 2 లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, సుధాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, విద్య సాగర్, కొండలరావు, అరవింద్ జగిర్ధార్, సాయి, ఎ.ఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version