గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ పుష్ప నగేష్

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ వియజలక్ష్మి, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, గత 10 నెలల కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన ఆరు గ్యారంటీల పథకాలపై ప్రజా స్పందనను విశ్లేషించడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని ఏర్పర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత, అనుబంధ సంఘాల చురుకుదనం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా వివరమైన చర్చ జరిగినట్లు కార్పొరేటర్ పుష్ప నగేష్ తెలిపారు.

Join WhatsApp

Join Now