Site icon PRASHNA AYUDHAM

సబ్దర్‌నగర్ ఈ బ్లాక్‌లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాదయాత్ర 

IMG 20250622 WA2369

సబ్దర్‌నగర్ ఈ బ్లాక్‌లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాదయాత్ర

ప్రశ్న ఆయుధం జూన్ 22: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ సబ్దర్‌నగర్ ఈ బ్లాక్‌లో అన్ని శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా కార్పొరేటర్ స్థానిక నివాసితులను కలుసుకొని, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యక్తిగతంగా అవగాహన పొందారు.

ప్రజలు ముఖ్యంగా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, సీసీ రోడ్డుల పనులు మరియు మంచినీటి సరఫరాలో ఏర్పడిన అంతరాలు కరెంట్ తీగలు వేలాడుతున్న, మరియు స్తంబాలు, ట్రాన్స్ఫార్మర్ లకు ఫెన్సింగ్ ఏర్పాటు వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో వీలైనంత త్వరలో సమస్యలకు పరిష్కారం చూపేందుకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ జాకీ, టీజీ ఎస్పీడీసీఎల్ ఏఈ బీమా, లైన్ మెన్ రాజు, సివరేజ్ సూపర్వైజర్ తుకారాం, అబ్దుల్ హమీద్, వేను, విక్రం , జోగారావు , లోకేశ్, వెంకట్, శంకర్, నారాయణ , హేమంత్, రాజు, షానవాజ్, రిజ్వాన్, ఫేరోజ్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version