Site icon PRASHNA AYUDHAM

ఏసీబీ అధికారుల వలలో అవినీతి చేప చిక్కింది..

IMG 20250617 WA2051

ఏసీబీ అధికారుల వలలో అవినీతి చేప చిక్కింది..

మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఒక కాంట్రాక్టర్ నుండి 30 వేల రూపాయిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఒంగోలు డీఎస్పీ ఎస్ శిరీష మీడియాకు వివరించారు. శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ మూడు అభివృద్ధి పనులు చేశారు. పెండింగ్ బిల్లులు అప్రూవల్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో కాంట్రాక్టర్ నుండి 30 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావును ఏసీబీ డిఎస్పీ శిరీష వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు, శేషు,సబ్-ఇన్స్పెక్టర్లు ప్రసాద్, మస్తాన్ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు..

Exit mobile version