మండలి చైర్మన్ గుమ్మడి వెన్నెలకు డాక్టర్ మద్దెల సన్మానం

ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ కుమార్తె) ను డాక్టర్ మద్దెల శివకుమార్ ఘనంగా సన్మానించారు. మాదాపూర్ లో గల వారి కార్యాలయ ఛాంబర్ లో శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచి పూల బొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.కవి సినీగీత రచయిత గాయకులు,గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సమాజసేవకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు బృందం!ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ అన్న ఆశయాల సాధన కోసం కృషి చేయాలనీ అన్నారు.అణగారిన ప్రజల అన్నార్తుల అభాగ్యుల నిరుపేదల గుండెచప్పుడై,గొంతుకై ఆర్తనాధమై, తన పాట ద్వారా ప్రతిధ్వనించి, తెలంగాణ ఉద్యమానికి తన పాట ద్వారా ఊపిరి పోసి,ఆఖరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు మరియు సమ సమాజ స్థాపన కొరకు,తన జీవితాన్ని అంకితం చేసి,ధారపోసి,త్యాగాలు చేసి అమరుడైన, ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ అన్న ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఇటీవల నూతనంగా తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్గా, నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ అన్న కుమార్తె మరియు గద్దర్ అన్న ఆశయాల వారసురాలు , అభ్యుదయ వాది, ఉన్నత విద్యావంతురాలు, శ్రీమతి గుమ్మడి వెన్నెల ని వారి చాంబర్లో కలిసి, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో కలిసి వారిని ఘనంగా సత్కరించి అభినందించి, శుభ సూచకంగా స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ప్రతిష్టాత్మక పదవికి వారిని ఎంపిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్కకి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ , గద్దర్ అన్న ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, పేద కళాకారులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళిక, వృద్ధ కళాకారులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, మొదలైన అంశాలపై దృష్టి సారించాలని, తెలంగాణ ప్రజల కళల ప్రాచుర్యం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల గుమ్మడి వెన్నెలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా గుమ్మడి వెన్నెల స్పందిస్తూ, రాష్ట్రమంతా తిరిగి కళాకారుల స్థితిగతులను తెలుసుకుంటానని, వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తానని, తెలంగాణ కళల ప్రాచుర్యం కోసం మరియు నాన్నగారైన స్వర్గీయ గద్దర్ ఆశయాల సాధన కోసం తప్పకుండా కృషి చేస్తానని , తనను సత్కరించి అభినందించిన తనకు అత్యంత సన్నిహితులు దేవుడిచ్చిన అన్నయ్య లాంటి ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారుఈ ఆత్మీయ ఆహ్లాద తరుణంలో ఆచార్య డాక్టర్ మద్దెల ,స్వర్గీయ గద్దర్ అన్న ఆలపించిన భూమి కోసం ముక్తి కోసం
బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు గన్న సమ సమాజం ఎప్పుడు ఏర్పడుతుంది అన్న అని అడిగినప్పుడు తమ్ముడు! ఈ మహా దాశయంతో భావ సారూప్యతతో ఎప్పుడు కలుస్తాయి .
ఆచార్య డాక్టర్ మద్దెల గుర్తుచేస్తూ,
అప్పటినుండి తాను గద్దర్ అన్నతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నానని, వారి ఇంటికి కూడా పలుమార్లు వెళ్లడం జరిగిందని,
రవీంద్ర భారతి లోను త్యాగరాయగాన సభలోను అనేక కళావేదికలపై, స్వర్గీయ గద్దర్ అన్న నేను భాగస్వామ్యాన్ని వహించడం జరిగిందని,
ప్రముఖ కళా సంస్థ నివేదిత ఆర్ట్స్ అధినేత ప్రముఖ గాయకుడు స్వరకిరీటి, స్వర్గీయ గద్దర్ అన్నకు ప్రియ శిష్యుడు శ్రీ సుభాష్ కళా సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా, స్వర్గీయ గద్దర్ అన్నను ముఖ్యఅతిథిగా పిలిచి వారి చేతుల మీదుగా
భారతరత్న అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును నేను స్వీకరించడం అది నా పూర్వజన్మ సుకృతమని ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణించారు
అంతేకాకుండా ఆవేదికపై, స్వర్గీయ గద్దర్ అన్న స్వయంగా రచించిన ఒరేయ్ రిక్షా చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్, మల్లెతీగకు పందిరి ఓలె నేను స్వయంగా ఆలపించి స్వర్గీయ గద్దర్ అన్న ప్రశంసలు పొందడం అదృష్టమని ఆచార్య డాక్టర్ మద్దెల సంతోషం వ్యక్తపరిచారు.
సినీ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ శ్రీ రామన్న, సినీ నటులు మరియు చిత్రపురి కాలనీ వెల్ఫేర్ సొసైటీ (ఎల్ఐజి & ఈ డబ్ల్యూస్) సంయుక్త కార్యదర్శి శ్రీ తాండూర్ ధనరాజ్, సామాజిక దళిత ఉద్యమ నాయకులు కాకెల్లి సైమన్, అభ్యుదయ వాది వరప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నరు.

Join WhatsApp

Join Now