Site icon PRASHNA AYUDHAM

ప్రజా సమస్యల పట్ల పోరాడే పార్టీ సిపిఎం పార్టీ

ప్రజా
Headlines in Telugu
  1. సిపిఎం పార్టీ జమ్మికుంటలో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగింపు
  2. సిపిఎం పార్టీ: ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేస్తాం
  3. జమ్మికుంట పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, పందుల సమస్యలపై సిపిఎం డిమాండ్
  4. సిపిఎం పార్టీ: వీధి కుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలని సిపిఎం కార్యదర్శి
  5. సిపిఎం పార్టీ జమ్మికుంట: ప్రజా హక్కుల కోసం సాగుతున్న నిరంతర పోరాటం

సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి సతీష్*

*జమ్మికుంట డిసెంబర్ 1 ప్రశ్న ఆయుధం::-*

ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాడే పార్టీ సిపిఎం పార్టీ అని సిపిఎం పార్టీ జమ్మికుంట పట్టణ కార్యదర్శి దిండిగారి సతీష్ అన్నారు నవంబర్ 29,30 తేదీలలో రెండు రోజులపాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ పదవ జిల్లా మహాసభలలో రెండవసారి ఏకగ్రీవంగా జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి, మిల్కూరి వాసుదేవ రెడ్డికి,జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన శీలo అశోక్, కొప్పుల శంకర్ లకి సిపిఎం పార్టీ జమ్మికుంట పట్టణశాఖ కార్యదర్శి దండిగారి సతీష్ విప్లవ శుభాభివందనాలు తెలిపారు.ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక,రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్ స్ట్) జిల్లా మహాసభలలో తీసుకున్న కర్తవ్యాలను, ముందుకు తీసుకెళ్తామని రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అలాగే జమ్మికుంట పట్టణంలో 30 వార్డులలో, రోడ్లు డ్రైనేజీ, సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.పట్టణంలో మళ్లీ పందులు కోతుల బెడద విపరీతంగా ఉందని మరోపక్క వీధి కుక్కలు సంచరిస్తున్నాయని వీటి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version