స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం.. సిపిఐ!!

*సిపిఐ శ్రేణులు స్ధానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి…*

*సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు*

*మోటకొండూరు మండల కేంద్రంలో మండల జనరల్ బాడి సమావేశం*

ప్రశ్న ఆయుధం 12ఆగష్టు యాదాద్రిభువనగిరి జిల్లా :
కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అన్నారు.మోటకొండూరు మండల కేంద్రంలో ఎర్పాటు చేసిన సీపీఐ మండల జనరల్ బాడి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ముందుగా మండల కేంద్రంలో సిపిఐ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మోటకొండూరు మండలానికి అన్ని గ్రామాల నుండి లింక్ రోడ్డు సౌకర్యం కల్పించాలని,అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భావనలు నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేయాలని,అర్హులైన ప్రతి ఒక్కరికీ, పెంచాన్, రేషన్ కార్డులు అందివ్వాలని కోరారు.స్థానిక సంస్ధల ఎన్నికల్లో గ్రామాల్లో వార్డు మెంబర్, సర్పంచ్,ఎంపీటీసీ గా పోటీకి సిద్ధం కావాలన్నారు.గ్రామాల్లో బలాల మేరకు సొంతంగా పోటీ చేయాలని అన్నారు.నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉండాలని సూచించారు.కాంగ్రెస్ పార్టి ఎన్నికల మేనిఫెస్టో అమలుకోసం నిరంతరం సిపిఐ పోరాడుతూనే ఉంటుదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లు యానాల దామోదర్ రెడ్డి బోలగాని సత్యనారాయణ, సీనియర్ శీనన్న నాయకులు రేగు సిద్దయ్య మండల కార్యదర్శి గదాగానీ మాణిక్యం మండల కార్యవర్గ సభ్యులు ఆలేటి బాలరాజు ముసుగు పెంటారెడ్డి పల్లె వెంకన్న బోల శ్రీనివాసు మంచాల రాధమ్మ పసుల నరసింహ బీరకాయల మల్లేష్ సొప్పరి భాగ్యమ్మ ఏనుగు వెంకట్ రెడ్డి బొంగు బిక్షం బడిగె సుదర్శన్ బోలగాని అశోక్ పిట్టల కర్ణాకర్ జీవికలపల్లి పాండు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now