Site icon PRASHNA AYUDHAM

సిపిఎం కొమరవెల్లిమండల 3వ మహాసభలనుజయప్రదం చేయండి

సిపిఎం
Headlines:
  1. “సిపిఎం కొమురవెల్లి మండల 3వ మహాసభలు నవంబర్ 12న”
  2. “సిపిఎం మహాసభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు”
  3. “రైతాంగ పోరాటాలకు సిపిఎం భరోసా: ఆముదాల మల్లారెడ్డి”
  4. “సిద్దిపేట జిల్లా 3వ మహాసభలు డిసెంబర్ 1, 2 తేదీల్లో గజ్వేల్ లో”

సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

సిద్దిపేట అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం : 

సిపిఎం పార్టీ కొమురవెల్లి మండల మూడవ మహాసభలు నవంబర్ 12 న ఐనాపూర్ గ్రామంలో నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబర్ 1,2 తేదీలలో సిద్దిపేట జిల్లా 3 వ మాసభలు గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్నట్లు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ కొమురవెల్లి మండల కమిటీ సమావేశం తాడూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా దేశవ్యాప్తంగా భూ ఉద్యమాలు రైతాంగ పోరాటాలు కార్మిక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూములు పంచడం జరిగిందని వెట్టి చాకిరి నుండి విముక్తి జరిగిందని అన్నారు నేడు అంతర్జాతీయంగా అమెరికాకు దీటుగా చైనా ఆర్థికంగా టెక్నాలజీ పరంగా అమెరికా తో పోటీ పడుతూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. రాబోయే కాలమంతా ఎర్ర జెండా దే అని వారు అన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని అందుకు వారు సిద్ధంగా ఉండాలని మండల జిల్లా మహాసభల జయప్రదం కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి మండల నాయకులు తేలు ఇస్తారి, మల్లేశం, పుల్లంపల్లి సాయిలు, బక్కిలి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version