డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి

డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

ఈ సందర్భంగా పత్రిక విలేకరులతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ డిఎం

శనివారం ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు డయల్ యువర్ డిఎం పేరుమీద మీ యొక్క సమస్యలు తెలియజేయాలని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం కి కొమరాడ మండలంలో గల పార్వతీపురం నుండి క ల్లికోట వరకు వెంటనే బస్సును పునరుద్ధరించాలని ఎందుకంటే గతంలో రోడ్డు పెద్ద పెద్ద గోతులుగా మారడంతో బస్సు నిలుపుదల చేయడం జరిగిందని బస్సును వేయమని అనేకసార్లు డిఎం కి చెప్పినప్పుడు కూడా ముఖ్యంగా రోడ్డు గోతులుగా ఉండటంతో బస్సు నిలుపుదల చేయడం జరిగిందని డిఎం  చెప్పడం జరిగిందని అయితే ఇప్పుడు బీటి రోడ్డు వేయడంతో మళ్లీ క ల్లి కోట వరకు బస్సు పునరుద్ధరించాలని డిఎం చెప్పడం జరిగింది అలాగే పార్వతీపురం నుండి కు నేరు వరకు గడిచిన మూడున్నర సంవత్సరాలు కాలంగా రాత్రి పార్వతీపురంలో తొమ్మిది గంటల 45 నిమిషాలకు గతంలో బయలుదేరిన నైట్ ఆల్ట్ బస్సు లేకపోవడం వల్ల రాత్రి పార్వతీపురం నుండి ఏడు గంటల 15 నిమిషాలు దాటితే కొమరాడ మండలానికి రావలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి నైట్ ఆల్ట్ బస్సు కు నేరు వరకు వెంటనే పునరుద్ధరించాలని అలాగే గతంలో మాదిరిగా పార్వతీపురం నుండి మచి మండ గ్రామం మీదుగా లంజా గ్రామం వరకు రహదారి బస్సు ఉండేదని గడిచిన మూడున్నర సంవత్సరాలుగా ఆ బస్సు పూర్తిగా రద్దు చేయడంతో గిరిజన ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారని ఇప్పుడు బీటీ రోడ్డు కూడా కొంతవరకు వేయడం జరిగిందని కేవలం ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి తప్ప మిగతా సందర్భంలో ఆర్టీసీ బస్సులు ఆయా గ్రామాలకు వెళ్లకపోవడం చాలా అన్యాయం కాబట్టి పార్వతీపురం నుండి మసీమండ మీదగా లంజా గ్రామానికి వెంటనే బస్సును గతంలో మాదిరిగా పునరుద్ధరించాలని ఆర్టీసీ డిఎం కి చెప్పడం జరిగింది ఈ సమస్యలు విన్న ఆర్టీసీ డిఎం ఈ సమస్యలను మాన్ హెడ్ ఆఫీస్ కి తెలియజేశామని హెడ్ ఆఫీస్ నుండి అనుమతి వచ్చిన వెంటనే బస్సులు మళ్లీ మీరు చెప్పే విధంగా పునరుద్ధరిస్తామని డిఎం  చెప్పడం జరిగింది ఏదేమైనా గ్రామాలకు బస్సులు వెయ్యమని గత ఎమ్మెల్యే మళ్లీ ప్రజెంట్ ఎమ్మెల్యే  ఆర్టీసీ డిఎం ఎన్నిసార్లు చెప్పినా సిపిఎం పార్టీగా మేము ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా బస్సులు వెయ్యకపోవడం చాలా విడ్డూరంగా ఉందని కాబట్టి ఇప్పటికైనా పైన తెలిపిన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా కొమరాడ మండల గ్రామాలకు చెందిన ప్రయాణికులకు ఆదుకోవాలని లేని యెడల భవిష్యత్తులో ఈ సమస్యల పైన ఇప్పటికే అనేక విధాలుగా ఆందోళన చేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా ఇంకా ఈ సమస్యల పైన ఆందోళన చేయడానికి పెద్ద ఎత్తున ప్రయాణికులతో కలిసి ముందుకు వెళ్తామని ఈ సందర్భముగా ఆర్టీసీ అధికారులకు తెలియజేయుచున్నాము

Join WhatsApp

Join Now

Leave a Comment