Site icon PRASHNA AYUDHAM

భగలాముఖి సన్నిధిలో భక్తుల సందడి

IMG20240705122356

oplus_2

●అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

●శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో

●భగలాముఖి అమ్మవారికి అభిషేకం విశేష పూజలు

●పబ్బ అంజయ్య రమవ్వ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 2 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండల కేంద్రంలో కొలువై వెలసిన భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి ప్రీతివంతమైన రోజు అమావాస్య కావడంతో దేశ నలుమూలల నుంచి పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున రావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకి టలాడింది. అమావాస్య సందర్భంగా భగలాముఖి శక్తిపీఠం ఆలయంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో గల యాగశాలలో ప్రత్యేక యజ్ఞం నిర్వహించి భగలాము ఖి అమ్మవారికి అర్చన మహా మంత్ర హవనం మహా పూజ విశేషపూజలు పంచామృతాలతో అభిషేకం ఆ రిద్రార్చన హవనం, పూర్ణాహుతితో పూజలు ముగిం చారు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశామని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో నేను బాగుండకున్న పరవాలేదు కానీ ఇంకొకరు బాగుండకుంటే బాగుండని చెడు కోరే మన శత్రువులు ఉన్నారని శివ్వంపేట భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు వారి శత్రువుల నాలుకలు పట్టుకొని శత్రువు యొక్క చెడు మాటలను మనకు నష్టం కలిగించే మాటలను స్తంభింపజేసి భక్తులకు ఎలాంటి ప్రతి బాధలు కలగకుండా వాటిని తొలగింపజేసే శత్రుకారిని స్తంభ దేవత శ్రీ భగలాముఖి అమ్మవారిని భగలాముఖి వ్యవస్థాపకులు ట్రస్ట్ అధ్యక్షులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ అన్నారు అమ్మవారిని దర్శించిన భాగ్యం వల్ల కలిగే మోక్ష ఫలితాలను పుణ్యఫలితాలను భక్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జడ్పిటిసి

భగలాముఖి శక్తి పీఠం స్థలదాత పబ్బ రమేష్ గుప్తా స్వరూపమ్ము వారి తండ్రి పబ్బ రామమ్మ అంజయ్య గుప్త జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య రోజు న ట్రస్ట్ సభ్యులు శివ్వంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆలయ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని బగలాముఖి అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుందని జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నారు ఈ కార్యక్రమంలో పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version