దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ ఆధ్వర్యంలో కిన్నెరసానిలో అప్పగింతప
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి ఏప్రిల్ 11అ
డవి నుంచి ఎటు వెళ్ళాలో తెలియక ఎండ దాహం కి తట్టుకోలేక దారితప్పి మేకల గుంపులో
చేరిన ఓ దుప్పి పిల్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని రక్షించారు. దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన కొందరు మేకల కాపరులకు చెందిన తమ మేకల గుంపుతో ఓ దుప్పిపిల్ల కలవటాన్ని గమనించారు. ఇట్టి సమాచారాన్ని వెంటనే స్థానిక దమ్మపేట మండల అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి ఏ.కరుణాకరచారి తన సిబ్బందితో కలిసి గ్రామపెద్ద జలగం శ్రీనివారావు సమక్షంలో దుప్పిని స్వాదీనం చేసుకున్నారు.స్వాదీనం చేసుకున్న అనంతరం దుప్పీపిల్లను సురక్షితంగా కిన్నెరసాని అభయారణ్యనికి తరలించారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోటేశ్వరరావు,బీట్ ఆఫీసర్ రామారావు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.