ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే..తెల్లారేసరికి..

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే..తెల్లారేసరికి..

మీరు ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా? మాటముచ్చట కోసం పార్క్‌కి వెళ్లకుండా లాడ్జీకి వెళ్తున్నారా? అయితే జర భద్రం. రూమ్‌లో కంటికి కనిపించని నిఘా నేత్రాలు మిమ్మల్ని స్కాన్ చేస్తుంటాయి. మీరేం చేసినా ఇట్టే పట్టేస్తుంటాయి. మ్యాటర్ అక్కడితో ఆగదు.. బ్లాక్‌మెయిల్‌తో జీవితాలను బర్‌బాజ్ చేసే కుట్ర జరుగుతోంది. ఇంతకీ ఎక్కడనేగా మీ డౌట్.. మీరే చూడండి.

*ఇద్దరు ప్రేమికులు.. మనసు విప్పి మాట్లాడాలనుకున్నారు. పార్క్‌లు, థియేటర్ల అయితే డిస్టర్బ్ అని భావించి లాడ్జీకి వెళ్లారు.* అలా వెళ్లి ఇలా వచ్చారు.. బట్ గ్యాప్‌లో చాలా జరిగింది. బయటకు చెప్పుకోలేక.. బాధను దిగమింగుకోలేక సతమతమయ్యారు. అసలు లాడ్జీలో ఏం జరిగింది..? వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలంలోని శ్రీ రాఘవ రామ లాడ్జి అది. కొద్దిరోజుల క్రితం ఓ ప్రేమజంట ఈ లాడ్జీకి వెళ్లింది. ఓ రూమ్‌ అద్దెకు తీసుకుంది. కొద్ది గంటలు ఉండి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్లకు ఓ కాల్ వచ్చింది. ఫలానా లాడ్జీలో మీ రొమాన్స్‌ చిత్రం.. మా చేతిలో ఉంది.. డబ్బు ఇస్తే సరి అంటూ కాల్ కట్ చేశారు. ఆ మాట విని ప్రేమికులిద్దరూ షాకయ్యారు. షాక్‌ నుంచి తేరుకోకముందే మరోసారి కాల్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని చెప్పడంతో.. వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. పరువు పోతుందని భావించిన ప్రియురాలు.. తన దగ్గరున్న బంగారాన్ని అమ్మి వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment