రుణమాఫీలో కటింగ్‌లు..

IMG 20240817 WA0033

రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. కేవలం 22.37 లక్షల మంది రైతులకు, రూ.17,934 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారాస నేతల మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రుణమాఫీ 40 శాతం మాత్రమే పూర్తి చేశారని చెప్పారు.రుణమాఫీలో అనేక కటింగ్‌లు పెట్టారు. సవాలక్ష కొర్రీలు, ఆంక్షలు విధించారు. సీఎం అంటే కటింగ్‌ మాస్టర్‌లా తయారయ్యారు. డిసెంబరు 9 నుంచి ఆగస్టు 15వరకు రుణమాఫీని జాప్యం చేశారు. బ్యాంకులకు 9 నెలల వడ్డీ ఎవరు కడతారు?రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.̲.̲

Join WhatsApp

Join Now