కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాపీ పేరుతో భారీ మోసానికి పాల్పడిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు 100శాతం రుణమాపీ అయ్యిందని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాపీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన సీఎం.. ఇప్పుడు రుణమాపీ పేరుతో దగా చేసారని మండిపడ్డారు. సీఎం అంటే కట్టింగ్ మాష్టర్ అని నిరూపించుకున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు.