Site icon PRASHNA AYUDHAM

పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో

IMG 20250623 WA2060

*క్రమశిక్షణ , సుపరిపాలనతో 11 ఏళ్ల మోడీ సర్కార్ వికసిత్ భారత్ లక్ష్యంతో అభివృద్ధికి కొత్త నిర్వచనాన్నిచ్చింది*

*11 ఏళ్ల బిజెపి పాలన దేశ ప్రజలందరికీ అమృతకాలంలాంటిది*

*డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలతో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం*

*హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి*

*కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను విమర్శించే స్థాయి, అర్హత కౌశిక్ రెడ్డికి లేదు*

*సంకల్ప సభలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

*జమ్మికుంట /ఇల్లందకుంట జూన్ 23 ప్రశ్న ఆయుధం*

భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ , జనసంగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను, ఆలోచనలను అమలు చేస్తూ, దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దేందుకు బిజెపి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి పనిచేస్తుందని 11 ఏళ్ల మోడీ సర్కార్ దేశంలో క్రమశిక్షణ, సుపరిపాలన రెండింటిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని లిఖించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్ప సాకారం పేరిట చేపట్టిన ప్రోగ్రాంలో భాగంగా సోమవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో సంకల్ప సభ నిర్వహించారు సమావేశానికి హాజరైన కృష్ణారెడ్డి ముందుగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి మాట్లాడుతూ ఒక దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు కుదరదు అనే నినాదంతో శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతదేశ సమగ్రత , ఐక్యత కోసం చారిత్రక పోరాటం చేశారన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగం , సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నిస్తాయన్నారు. జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో అంతర్భాగంగా మార్చేందుకు దేశాన్ని ప్రేరేపించి, ఒకే దేశం, ఓకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం, 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడి బలిదానమైన యోధుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశ రాజకీయాలు , విధానాలు, జాతి ప్రయోజనాలు , విద్య, సాంస్కృతిక , జాతీయవాదం వంటి రంగాలలో ప్రత్యేక ముద్ర వేసిన గొప్ప నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన ఆశయాలతో బిజెపి ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ సర్కార్ సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ సబ్ కా వికాస్ సబ్ కా ప్రయాస్ అనే మంత్రాన్ని అనుసరించి ముందుకు కొనసాగుతుందన్నారు.వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మోదీ సర్కార్ విజయవంత పాలన 11 ఏళ్లుగా కొనసాగిస్తుందన్నారు .2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 11 ఏళ్లలో భారతదేశ దిశా దశ మార్చిందని , భారత వైభవాన్ని విశ్వ వేదికపై నిలబెట్టిందని , సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ప్రయాణాన్ని సాగిస్తుందని తెలిపారు. వాగ్దానాలన్నీ కార్యాచరణగా మార్చి, సంక్షేమం నుండి సంరక్షణ వరకు 11 ఏళ్ల కాలంలో, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తో నాయకత్వం అంటే ఏమిటో దేశానికి, ప్రపంచానికి ప్రధాని మోడీ చూపెట్టారని తెలిపారు. 370 ఆర్టికల్ , నోట్ల రద్దు , జీఎస్టీ , మేకిన్ ఇండియా , ఆత్మ నిర్భర్ లాంటివి మోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక , సాహసోపేత నిర్ణయాలు దేశ భవిష్యత్తుకు కీలకంగా మారాయన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తూ, నారీ శక్తికి పట్టంకట్టి, యువశక్తికి పగ్గాలిచ్చి , రక్షణ రంగంలో మేటిగా నిలిచి, అంతరిక్షాన పట్టు సాధించి, విద్యా వ్యవస్థకు మెరుగులు దిద్ది, దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తు, విశ్వ గురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న ఘనత ప్రధాని మోదీ దే నన్నారు. ప్రజల ఆశీర్వాదం, విశ్వాసం, నమ్మకంతోనే దేశంలో వరుసగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రజా ఆశీస్సులతో తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలతో ప్రజలందరినీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పని అయిపోయిందని కృష్ణా రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను విశ్వసించే పరిస్థితి లేదని, అందుకేప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని , మోడీ ప్రభుత్వ పాలన పట్ల విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.

*పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో*

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు . పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, బండి సంజయ్ కుమార్ ను విమర్శించే స్థాయి అర్హత కౌశిక్ రెడ్డికి ఎక్కడిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి తనస్థాయి ఏంటో తెలుసుకోకుండా, దిమాక్ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేయకపోతే చచ్చిపోతానని బెదిరించి, నేడు నియోజకవర్గ సమస్యలను ప్రజలను గాలికి వదిలేసి , పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ నీకు దేవుడైతే పూజలు చేసుకో.. భజనలు చేసుకో.. కౌశిక్ రెడ్డి..! కాలేశ్వరం అవినీతి, ఫోన్ టాపింగ్ గురించి , మీ అవినీతి ప్రజలందరికీ అర్థమైంది.. ఇంకా డ్రామాలు ఎందుకు?కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ టాపింగ్ చేసింది ఎవరు..? దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం కౌశిక్ రెడ్డి నీకు ఉందా…? ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గం పై బాధ్యత లేదు. ఎప్పుడూ ఏదో పనికిమాలిన వివాదంతో పబ్లిక్ సిటీ కోసం ఆరాటపడం తప్ప కౌశిక్ రెడ్డి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. కౌశిక్ రెడ్డి ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమం లో ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు,గుత్తికొండ రాంబాబు, ఉప్పుల రమేష్, కంకణాల రవీందర్ రెడ్డి, ఎండీ షఫీ, నల్ల లింగారెడ్డి, గురుకుంట్ల సాంబయ్య, అంతం ఎల్లారెడ్డి,తాళ్ల లావణ్యపాపిరెడ్డి,మట్ట పవన్ రెడ్డి, ఉప్పు దుర్గయ్య, జోడు సంపత్, సంజీవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version