Site icon PRASHNA AYUDHAM

ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఫ్లైట్ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్!

IMG 20250620 WA2231

ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఫ్లైట్ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్!

గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాలను చవి చూస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం Al2470 ఒక పక్షితో ఢీకొట్టింది. దీంతో విమానాన్ని పూణేలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించి, జూన్ 20న పూణే నుండి ఢిల్లీకి ఎగురుతున్న A12470 విమానం పక్షి ఢీకొనడం వల్ల రద్దు చేయడం జరిగిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్కమింగ్ విమానం పూణేలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇది బయటపడింది. దర్యాప్తు కోసం విమానా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

మరోవైపు తనిఖీల నేపథ్యంలో ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ సమయంలో, 3 విదేశీ మార్గాల్లో విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ లక్ష్యం ప్రోగ్రామ్ స్థిరత్వాన్ని పునరుద్ధరించడమేనని ఎయిర్లైన్ తెలిపింది. అలాగే, ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది.

Exit mobile version