తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకెళ్లిన కూతురు
మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి
(ప్రశ్న ఆయుధం) జులై 10
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో ఓ యువతి తన ప్రియుడు, తల్లితో కలిసి తండ్రిని హత్య చేసింది. వివాహేతర బంధానికి అడ్డుతగలుతున్నాడనే కోపంతో లింగం అనే వ్యక్తిని కుమార్తె మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద కలిసి మత్తు మందు ఇచ్చి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సెకండ్ షో సినిమా చూసి వచ్చి, మృతదేహాన్ని క్యాబ్లో తీసుకెళ్లి ఎదులాబాద్ చెరువులో పడేశారు. కాగా, ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.