దుక్కి దున్నకుండ పంటల సాగు నేల ఆరోగ్యానికి మేలు డిడిఎం జయప్రకాష్

*దుక్కి దున్నకుండ పంటల సాగు నేల ఆరోగ్యానికి మేలు*

*డిడిఎం జయప్రకాష్*

*జమ్మికుంట మే 16 ప్రశ్న ఆయుధం*

IMG 20250516 WA2152

దున్నకుండా పంటల సాగు నేల ఆరోగ్యానికి మేలు అని డిడిఎం జయప్రకాష్ అన్నారు శుక్రవారం నాబార్డు వారి ఆర్ధిక సహాకారంతో జమ్మికుంట కృషివిజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో దుక్కి దున్నకుండా పంటల సాగు – సగుణ పునరుత్పాదక పద్ధతి ప్రాజెక్టు ప్రారంబోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన డిడియం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు కరీంనగర్ మేనేజర్ జయప్రకాష్ మాట్లాడుతూ నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో కరీంనగర్ జిల్లాలోని 3 మండలాల్లో గల 16 గ్రామాల్లోని 25 మంది రైతులతో ఒక్కొక్కరి చొప్పున 25 ఎకరాలలోని వ్యవసాయ క్షేత్రంలో దుక్కి దున్నకుండా పంటల సాగు పైన ప్రయోగాత్మకంగా పరిశీలన చేయడం జరుగుతుందని తెలియచేశారు. అలాగే వ్యవసాయం లో ఇటువంటి నూతన సాంకేతిక పద్ధతులకు నాబార్డ్ వారు ముందు ఉండి ఆర్థికంగా సహాయపడుతూ ప్రోత్సహిస్తామని జిల్లా ఉద్యాన వన & పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ సగుణ పునరుత్పాదక పద్ధతి నేల రక్షణ కి పునాది లాంటిదని పునాది బాగుంటేనే నేల నిర్మాణం, నేల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ఈ పద్ధతి ఒక సుస్థిర వ్యవసాయ పద్ధతి అని, ఇలా దుక్కి దున్నకుండా చేయడం వల్ల నేల ఆరోగ్యం క్రమక్రమంగా బాగుపడుతుందని అంతే కాకుండా రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించవచ్చునని తద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంజనేయులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ ఇటువంటి నూతన విధానాలను కలిసి కట్టుగా చేయడం వల్ల వాటిలో ఉన్న లోటు పాట్లను సులభంగా తెలుసుకోవచ్చని అలాగే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతికి దుక్కి దున్నకుండా చేసే పద్ధతి కి మధ్య వ్యత్యాసాన్నీ రైతులు గమనించాలని,వాటికి సంబంధించిన సమాచారాన్ని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల నుంచి తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ సగుణ పునరుత్పాదక పద్ధతి రూపకర్త చంద్ర శేఖర్ బట్సాలె గూగుల్ మీట్ ద్వారా వారి యొక్క అనుభవాలను తెలియజేశారు.దీనిని ఎం.వి.రావు తెలుగు లోకి అనువదిస్తూ రైతులకు అర్థం అయ్యేలా వివరించడం జరిగింది.కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో అవసరానికి మించి నీటిని అధికంగా వాడడం వల్ల ప్రకృతికి కూడా నష్టం కలుగుతుందని ఈ సమస్యలను అధిగమించడానికి సగుణ పునరుత్పాదక పద్ధతి అనగా దుక్కి దున్నకుండా పంటల సాగు ఉపయోగపడుతుందని ఇది పర్యావరణ హితమైన పద్ధతి అని తెలిపారు ఇది భూమిని పరిరక్షించే శూన్య సాగు విధానం అని ఈ విధానంలో కలుపు యాజమాన్యం కీలకమైంది అని తెలిపారు రైతులను ఈ విధానం పైన ఎటువంటి సందేహాలు వున్న కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలని వివరించారు.సస్య రక్షణ విభాగ శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధానం గురించి రైతులకు కంప్యూటర్ లో ప్రదర్శన ద్వారా క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏడిఏ సునీత, కేవికే శాస్త్రవేత్తలు, వ్యవసాయ & అనుబంధ రంగాల అధికారులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now