ఫీజు రియంబర్స్మెంట్ నిధుల వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్

*ఫీజు రియంబర్స్మెంట్ నిధుల వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్*

*బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్*

కరీంనగర్ జూన్ 28 ప్రశ్న ఆయుధం

పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ పాలకుల తరహాలోనే విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులు నిలిపివేసి ముందుగా పేద బడుగు బలహీన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు ఎన్నం ప్రకాష్ మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సుల సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లింపులు నిలిచిపోయాయని ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాయక, మరి కొంతమంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ కొరకు కళాశాలల చుట్టూ తిరుగుతూ మానసిక వేదనకు గురవుతున్నారని అదే విధంగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర ఫీజుల వసూలు చేయలేక ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ రాక కళాశాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు విద్యార్థుల, కళాశాల యాజమాన్యం లను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామని బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా విద్యార్థులను హరి గోస పెట్టిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా రెండు సంవత్సరాల నుండి విద్యార్థుల ఉసురు పోసుకుంటుందని ఇలాంటి సమయంలో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేసి ఇతరత్రా పనులు చేసుకుంటు చదువుకు దూరం అవుతున్నారని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నాలుగు వేల కోట్ల ఫీజు బకాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఎన్నం ప్రకాష్ డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ మెస్ చార్జీలు, బీసీ విద్యార్థుల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని, ప్రైవేటు యూనివర్సిటీలో సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలని. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అందరీని ఆదుకోవాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కళాశాల స్థాయి విద్యార్థుల, హాస్టల్స్ స్థాయి విద్యార్థుల స్కాలర్షిప్ లను ఫీజు రీయింబర్స్ మెంట్ ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment