ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్..
తెలంగాణలో వర్షాలతో పాటు డెంగ్యూ ఫీవర్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆగస్టు నెలలో తొలి పద్దెనిమిది రోజుల్లోనే అధికారికంగా 1624 మందికి డెంగ్యూ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఇందులో సగం ఒక్క హైదరాబాద్లోనే నమోదయ్యాయి. తర్వాత వరంగల్లో డెంగ్యూ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొంత ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో టెస్టులు చేయించుకోవడం వల్ల ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.