న్యాయం కోసం పోతే కేసులు పెడుతున్న డిఇఓ

13 నెలల సస్పెన్షన్ కాలమును సెటిల్ చేయమని సుమారుగా 50 పైగా వినతులు ఇచ్చిన ఉపాధ్యాయుని సమస్యపై 15 నెలల తర్వాత స్పందించిన డి.ఇ.ఓ. డబుల్ గేమ్ ఆడుతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 నెలల సస్పెన్షన్ కాలమును సెటిల్మెంట్ చేయమని గత జూన్ 17వ తేదీన వినతి పత్రం ఇవ్వగా డి. ఇ. ఓ తన చాణక్య నీతిని ప్రదర్శించి తెలివితో డి .ఇ . ఓ .ఆర్డర్ తేదీ: 26/06/2024 రోజున ఎం.ఈ.ఓ బాల్కొండ బట్టు రాజేశ్వర్ కు ఉత్తర్వులను ఇచ్చారు. ఇచ్చిన ఉత్తర్వులో 13 నెలల సస్పెన్షన్ కాలాన్ని ఏమి చేయాలో చెప్పకుండా, స్పష్టత లేని ఉత్తర్వులో అతి తెలివిగా టేక్ నెసెస్సరీ యాక్షన్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించడం. మరోవైపు డిఇఓ ఈ సమస్యను పరిష్కారం కాకుండా పెండింగ్ లో పెట్టే విధంగా ఫోన్ లో ఎం.ఈ.ఓ తో సంభాషించిన డి.ఇ.ఓ.,సదరు ఉపాధ్యాయుడు నుండి తమకు కావలసిన పారితోషికం ఇస్తే సరే, ఇవ్వకపోతే 13 నెలల కాలం వెనుకకు జరిపి చేయాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఉపాధ్యాయ లోకంలో చర్చలు జరుగుతున్నాయి. డీఈవో జిల్లాలోని ఎంఈఓ లకు పిజిహెచ్ఎం లకు ఇదేవిధంగా క్లారిటీ లేని ఆదేశాలు తల తోక లేని ఉత్తర్వులు ఇస్తున్నట్టు పలువురు ఎం .ఈ. ఓ లు ప్రధానోపాధ్యాయులు పెద్ద ఎత్తున గుసగుసలాడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశ్నించిన పరువులు ప్రధానోపాధ్యాయులను ఎంఈఓ లను డీఈవో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు ఉపాధ్యాయ లోకంలో కోడై కూస్తున్నది. డి.ఇ.ఓ. పైనా ఎం.ఇ.ఓ. ఎం ఈ ఓ పైనా డి.ఈ.ఓ ఈ విధంగా పని జరగకుండా మాటలు చెప్తున్నారు.బాల్కొండ ఎం.ఈ.ఓ ఉపాధ్యాయుడు రనవీర్ కు ఇచ్చిన తల తోక లేని నాన్ డ్రా యల్ సర్టిఫికెట్ దీనికి ప్రత్యక్ష నిదర్శనం. న్యాయం చేయమని డి ఈ ఓ దగ్గరికి వెళితే రణధీర్ ఉపాధ్యాయుడిపై నిజామాబాద్ రూలర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన డిఇఓ. ఎస్ హెచ్ ఓ ద్వారా ఆగస్టు 26న సదరు ఉపాధ్యాయుని పోలీస్ స్టేషన్ పిలిపపించి వివరాలు తెలుసుకున్న పోలీసులు. సదరు ఉపాధ్యాయుడికి జరుగుతున్న అన్యాయం గురించి వాస్తవాలు తెలుసుకుని ఎస్ హెచ్ ఓ సైతం ఖంగుతిన్నారు. ఐఏఎస్ అధికారులకు సైతం తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుదారి పట్టిస్తున్న వైనం.సదరు ఉపాధ్యాయుడి 13 నెలల సస్పెన్షన్ కాలమును సెటిల్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు ఆర్జెడి ఇచ్చిన ఉత్తర్వులను సైతం అమలు పరచడం లేదు. వీటిపై కలెక్టర్ , అడిషనల్ కలెక్టర్ ను కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్ కాలానికి సెటిల్మెంట్ చేయకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నాడు. ఉన్నత అధికారులకు సదరు ఉపాధ్యాయుడు బెదిరిస్తున్నాడు, మిస్ బిహేవ్ చేస్తున్నాడు అసంబద్ధమైన మాటలను జోడించి ఉన్నతాధికారులకు తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుడు రణవీర్ కు జరుగుతున్న అన్యాయం పై సమగ్ర విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అమలుపరిచి పదోన్నతితోపాటు సస్పెన్షన్ కాలాన్ని సెటిల్మెంట్ చేసే విధంగా సదరు ఉపాధ్యాయుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.