ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ జితేష్ తో టెలి కాన్ఫరెన్స్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టెలి కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ తో మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే లో భాగంగా ప్రతి ఎన్యుమరేటర్ ప్రతి కుటుంబం యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చెయ్యాలని ఆదేశించారు.సర్వేలో ప్రజల నుండి వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎటువంటి పొరపాట్లుకి తాగు లేకుండానమోదు చేయాలని సూచించారు.సేకరించిన సమాచారాన్ని గోప్యతగా ఉంచాలని అన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ సేకరించిన సమాచారం వారికి కేటాయించిన కేంద్రాల వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా సమాచారాన్ని నిర్దిష్ట సమయంలో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.సూపర్ వైజర్లు మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షించాలన్నారు.ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై ఎన్యుమరేటర్లు ఖచ్చితమైన వివరాలు సేకరించిందన్నారు. సర్వే సమయంలో ఆధార్‌, ధరణి పాస్‌బుక్‌, పాన్, రేషన్ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లు కూడా నమోదు చెయ్యాలి, కాబట్టి ఆయా పత్రాలు దగ్గర పెట్టుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి అని అన్నారు. ఒక్కో కుటుంబ వివరాల సేకరణకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున పత్రాలు దగ్గర పెట్టుకుంటే ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పడం సులభం అవుతుందని, మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోసిపిఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏవో రమాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now