Site icon PRASHNA AYUDHAM

ట్రాన్స్కో లో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

IMG 20250620 WA2086

ఉద్యోగుల సంక్షేమమే ప్రధానం 

ట్రాన్స్కో లో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

విద్యుత్ శాఖ సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్ లో ట్రాన్స్కో లోని 18 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, ఆర్టిజెన్స్ 11మంది ఉన్నారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ట్రాన్స్కో ఉద్యోగుల తో పాటు ఆర్టిజన్స్ కూడా కారుణ్య నియామకాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం మనీ డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్టిజన్స్ ను కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. కారుణ్య నియామక పత్రాలు పొందిన ఉద్యోగులు సంస్థ అభ్యున్నతికి తోడ్పడాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, డైరెక్టర్లు సూర్య ప్రకాష్, బి. నర్సింగరావు, జీ నరసింహారావు, FA&CCA గుప్తా, జాయింట్ సెక్రెటరీ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version