సిఐటియు ఆధ్వర్యంలో దేశాయి బీడీ కంపెనీ ముట్టడి..
రెండు గంటల పాటు కార్మికులతో భారీ ధర్నా దిగివచ్చిన యాజమాన్యం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16:
దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికుల నుండి సంవత్సరానికి 20 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నందుకు నిరసనగా దేశాయ్ బీడీ కంపెనీ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. రెండు గంటల పాటు జరిగిన ఆందోళన కి యాజమాన్యం దిగవచ్చి చర్చలకు పిలిచింది .పోలీసులు ప్రవేశించి ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఎంతటికి కార్మికులు వినకపోవడంతో దేశయీ బీడీ యాజమాన్యం వచ్చి చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం అయ్యేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఈనెల 23న చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేద్దామని యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమ జిల్లా అధ్యక్షుడు కందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ఎన్నడు లేని విధంగా జిల్లాలో 20 జీబులు వేసుకొని అన్ని కార్ఖానాలు తిరుగుతూ కార్మికుల నుండి వసూలు చేసిన 20 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ధర్నా కార్యక్రమానికి పోవద్దు అని కార్మికులను భయభ్రాంతులకు గురి చేసిన భారీ సంఖ్యలో కార్మికులు వచ్చి విజయవంతం చేశారని అన్నారు. దేశాయ్ కంపెనీ యాజమాన్యం కార్మికుల నుండి ప్రతి 1000 రూపాయలకు పది రూపాయల చొప్పున అన్యాయంగా వసూలు చేస్తుందని కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు మొత్తం 52 సెంటర్లలో సుమారు 100 కోట్లకు పైగా అవినీతికి కార్మికుల డబ్బును దోచుకున్న దానిలో దేశాయి బీడీ యాజమాన్యం ఉన్నదని దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు బయటపెట్టి కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శాంపిల్ బీడీ ల పేరుతో రోజుకు 400 బీడీలు వసూలు చేస్తున్నారని వెంటనే అది ఆపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కురుకురే ప్యాకెట్లను కార్మికులను ఇష్టం లేకున్నా కొనమని బలవంతం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కార్మికులను ఐక్యం చేసి మరోమారు దేశ బీడీ కంపెనీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు బాలమణి, ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, అరుణ్ ,శ్రీహరి రాణి భాగ్యమ్మ రేణుక లక్ష్మి ,ప్రేమ లత, జ్యోతి, సత్యం రాజనర్సు, వాణి మంజుల తదితరులు పాల్గొన్నారు.