సమాజ సేవలో నిలువెత్తు దర్పణం బోలిబత్తుల దేవదాసు
రామకోటి రామరాజు చేతుల మీదుగా సన్మానం
గజ్వేల్ అద్దాల మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామకోటి రామరాజు.
సమాజ సేవలో విశేష కృషి చేసిన బోలిబత్తుల దేవదాసుకు సన్మానం.
భద్రాచల దేవస్థానం ముత్యాల తలంబ్రాలు, స్వామివారి వస్త్రాలు అందజేత.
విశ్రాంత ఉపాధ్యాయుడు, పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా సేవలందించిన దేవదాసుకు ప్రశంసల జల్లు.
“కృషి, పట్టుదలతో సాధించనిది లేదు” — రామకోటి రామరాజు.
ప్రశ్న ఆయుధం గజ్వేల్, అక్టోబర్ 18:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అద్దాల మందిరం వద్ద శనివారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాజ సేవలో ముందంజలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు, పద్మశాలి సంఘ అధ్యక్షుడు బోలిబత్తుల దేవదాసును ఘనంగా సన్మానించారు. భద్రాచల దేవస్థానం నుండి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, స్వామివారి వస్త్రాలను ఆయనకు అందజేశారు.
రామకోటి రామరాజు మాట్లాడుతూ, “కృషి, పట్టుదల, సేవాభావం ఉన్నవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిదాయకులు. దేవదాసు అటువంటి వ్యక్తిత్వం కలవారు” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, పద్మశాలి సంఘ నాయకులు, భక్త సమాజ సభ్యులు పాల్గొన్నారు.