స్వప్నలోక్ లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

స్వప్నలోక్ కాలనీలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 04, కామారెడ్డి :

దేవీ నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి పట్టణం దేవునిపల్లి స్వప్నలోక్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలోని దుర్గ మాత మండపంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వప్న లోక్ ఆలయ కమిటీ శ్రీ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. దుర్గా దేవి ఆశీస్సులతో స్వప్నలోక్ కాలనీ సుభిక్షంగా ఉండాలని కాలనీ వాసులు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నారు . చెడుపై మంచి విజయం సాధించడానికి దేవీ నవరాత్రులు జరుపుకుంటారని తెలిపారు.

మొదటి రోజున దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయని శ్రీ హర్ష పంతులు తెలిపారు. ఉదయం గణపతి పూజతో ప్రారంభం కాగా, పుణ్య వచనం, అంకురార్పణ, అష్టదిక్పాలకుల స్థాపన, షోడశ గౌరీ సప్తమాతృక పూజ, కలశ స్థాపన, నవగ్రహ పూజ, అఖండ దీపారాధనతో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

నవరాత్రి వేడుకల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు గాయత్రి దేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున భవాని మాలాదారులతో పాటు భక్తులు తరలివచ్చి దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొడకల గోవర్ధన్, నీలం రమేష్, మచ్చ నాగరాజు, మురళి, అశోక్ రెడ్డి, లింగం స్వాములు, భక్తులు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now