ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా “దేవులపల్లి మహేందర్ యాదవ్”

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా “దేవులపల్లి మహేందర్ యాదవ్”

*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 28, ప్రశ్న ఆయుధం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గజ్వేల్ పట్టణానికి చెందిన దేవులపల్లి మహేందర్ యాదవ్ ఎంపికయ్యారు. సిద్దిపేటలో జరుగుతున్న 43వ రాష్ట్ర మహాసభల్లో ఆయనను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర శాఖ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అదేవిధంగా విద్యారంగ సమస్యలకై విద్యార్థుల పక్షాన పోరాడుతు వారికి అండగా నిలుస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ నీ బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now