Headlines
-
దేవునిపల్లి పాఠశాలకు ఎస్జీఎస్ ట్రస్ట్ వాటర్ ప్లాంట్ విరాళం
-
విద్యార్థుల కోసం దాతృత్వ హస్తం: ట్రస్ట్ అధినేత్రి భారతి శ్రీవారి
-
విద్యార్థుల సంక్షేమం కోసం దేవునిపల్లి పాఠశాలకు వాటర్ ప్లాంట్ బహూకరణ
-
విద్యార్థుల రుణపడి వ్యాఖ్యలు: దేవునిపల్లి పాఠశాల కార్యక్రమం
-
కామారెడ్డిలో దాతృత్వ కార్యక్రమానికి ఆకర్షణ: భారతి శ్రీవారి
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 02, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థమై ఎస్ జిఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి భారతి శ్రీవారి వాటర్ ప్లాంట్ ను అందజేశారు. వాటర్ ప్లాంట్ ను సోమవారం దేవుని పల్లి 12వ వార్డ్ కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారతి శ్రీవారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాకిషన్, ఉపాధ్యాయులు శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.