ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఏరియా ఉత్తమ అధికారి రమేష్ ని సత్కరించిన సేవా సభ్యులు
రెండువేల ఇరవై ఐదు జనవరి యిరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మణుగూరు ఏరియా ఉత్తమ అధికారిగా ఎంపికై కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం చేతులమీదుగా సన్మానం మరియు ప్రశంస పత్రం అందుకున్న మణుగూరు ఏరియా అధికార ప్రతినిధి డీజీఎం పర్సనల్ సలగల రమేష్ ని గురువారం సాయంత్రం మణుగూరు ఏరియా సింగరేణి వైవ్స్ అసోసియేషన్ వాసవి సేవా ఆధ్వర్యంలో శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మణుగూరు ఏరియా సేవా కార్యదర్శి షేక్ షాకీరా రవూఫ్ మాట్లాడుతూ నిజాయితీకి నిలువుటద్దం రమేష్ ని సంస్థ పట్ల అంకితభావం తో పాటు బాధ్యతగల అధికారిగా మణుగూరు ఏరియాలో యాజమాన్యానికి కార్మిక సంఘాలకు కార్మికులకు మధ్య తలలో నాలుకలా ఒక వారధిగా పనిచేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని పీవీ కాలనీలో సేవా కార్యాలయ నిర్మాణంలో కూడా రమేష్ గారి సహకారం మరువలేనిదన్నారు.సింగరేణి ఉన్నతాధికారుల అభినందనలు అందుకోవటం ప్రశంసనీయమని ఉద్యోగపర్వంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు ఈ సందర్భంగా రమేష్ కి ప్రశంసాపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏరియా సింగరేణి సేవా సమితి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సింగు శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరించగా ఏరియా సేవాసభ్యులు ఎస్.కె షాకిరా, సంధ్య, మాధవి, శోభ, కతార్, రమా, రేణుక,ఎం సత్య, హేమ, బి సత్య, కనక లక్ష్మి, మాధవి, రాయుడు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
డీజిఎం పర్సనల్ రమేష్ సేవలు ప్రశంసనీయం ఏరియా సేవా కార్యదర్శి షేక్ షాకీరా
