గిరిజనుల సాగు చేస్తున్న పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని గతంలో పట్టాలిచ్చిన వాటికి అడవి శాఖ అధికారులు సంతకాలు పెట్టాలని కోరుతూ కొమరాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ఈరోజు అనగా సోమవారం జరిగింది
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 24( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరరావు
ధర్నా అనంతరం కొమరాడ తాసిల్దార్ సిహెచ్ సత్యనారాయణ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి శివుని నాయుడు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు రామారావు హెచ్ రామారావు కైలాస్ రామస్వామి సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గిరిజనులు తమ రాత ముత్తాతల నుండి సాగు చేస్తున్న పోడు భూములకు 2006 అడవి హక్కుల చట్ట ప్రకారం 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వవలసి ఉండగా ఆ దిశగా పట్టాలు ఇవ్వకుండా పది ఎకరాలు సాగు చేస్తే 8 ఎకరాలకు 8 ఎకరాలు పోడు భూమి సాగుచేత్తే ఆరు ఎకరాలకు ఆరు ఎకరాలు సాగు చేస్తే మూడెకరాలకు మూడు ఎకరాల సాగు చేస్తే రెండు ఎకరాలకు రెండు ఎకరాలు సాగు చేస్తే ఎకరాకి భూమికి పట్టాలు ఇస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఇది చాలా అన్యాయం అని అలాగే ఇప్పటికే అడవి శాఖ అధికారులు కూడా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకి పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ పట్టాల పైన అడవి శాఖ అధికారులు సంతకాలు కూడా లేని పరిస్థితి ఉందని కాబట్టి ఇలాంటి సందర్భంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని అలాగే అన్నదాత సుఖీభవ కింద డబ్బులు కూడా ఇవ్వాలని అలాగే డి పట్టా భూములు గిరిజనులు దళితులు సాగు చేస్తున్న వాటిని పరిష్కారం చేయాలని అలాగే గతంలో పట్టాలిచ్చిన వాటిలో అతి తక్కువ భూమి నమోదయిందని అవి కూడా సరిచేసి గిరిజనులు ఎంత సాగు చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఐ టి డి ఎ అధికారులకు ఈ సందర్భంగా తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చెంబరు వెంకటరావు సుబ్బారావు నాగేశ్వరరావు లక్ష్మణరావు గణేష్ మధు పాల్గొన్నారు
కొమరాడ తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న నాయకులు ఫోటో నినాదాలు ఇస్తున్న ఫోటో వీడియో చూడగలరు