*విధులను బహిష్కరించి ధర్నా చేసిన న్యాయవాదులు*
*హుజురాబాద్ మార్చి 25 ప్రశ్న ఆయుధం*
హైదరాబాద్ చెందిన న్యాయవాది ఇజ్రాయిల్ పై పాశవికంగా దాడి చేసి హత్య చేసిన హంతకున్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ హుజురాబాద్ బార్ అసోసియషన్ అధ్యక్షుడు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ న్యాయవాదులపై జరిగే దాడులను అరికట్టేందుకు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, ఉపాధ్యక్షులు బండి రమేష్, న్యాయవాదులు భగవాన్ రెడ్డి విజయా రెడ్డి, ముక్కెర రాజు, లక్ష్మణ మూర్తి,శ్రీధర్ బాబు బత్తుల తిరుపతి,విక్రం, ముచ్చ దివ్య, భానుకిరణ్, హరికిషన్, రాజేష్, అనిల్, రవి, కళ్యాణ్, శ్రవణ్, జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.