దిశ సమీక్ష సమావేశం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధ) జూన్ 20
శుక్రవారం ఐడిఓసి లో పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్, అధ్యక్షతన దిశ సమీక్ష నిర్వహించడం జరిగింది.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మెంబర్ కార్యదర్శిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో 22 డిపార్ట్మెంట్లకు సంబంధిత అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో నామినేటెడ్ ప్రతినిధులకు వారి స్థానాలలో సరైన గౌరవం లభించలేదని గౌరవ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్టి విషయమై నామినేటెడ్ ప్రతినిధులకు గౌరవం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయ శాఖ తరపున డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తూ యువతకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించడం అయినది. అలాగే సేంద్రియ ఎరువులు గురించి వాణిజ్య పంటల గురించి రైతులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ ఏడికి ఆదేశించడం అయినది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ సహాయక సంచాలక భవనం, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యాశాఖ జిల్లాలోని పాఠశాల వారీగా పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ ను పెంచాలని, అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని లేనిచో త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖను, డిఆర్డిఓ ను ఆదేశించడం అయినది. ఉపాధి హామీ పథకం పని దినాలు 50 లక్షలకు పెంచే విధంగా తీర్మానం చేయడం జరిగినది. కామారెడ్డి జిల్లాలో ఎస్సీ,ఎస్టీ కుటుంబాలు ఎక్కువగా ఉండటం వలన పని దినాలు పెంచాలి కాబట్టి 22 లక్షలగా ఉన్న పని దినాలను 50 లక్షల పని దినాలుగా పెంచాలని తీర్మానించడమైనది. అంగన్వాడి సెంటర్లలో మౌలిక వసతులు పెంచాలని భవనాల నిర్మాణాలు చేపట్టాలని సఖి సెంటర్ నిర్మాణపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని ఆదేశించడం అయినది. కామారెడ్డి మున్సిపాలిటీ అమృత్ కార్యక్రమం కింద త్రాగునీటి సమస్యను 100% పూర్తి చేయాలని నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ని ఆదేశించడం అయినది. మరియు ప్రధానమంత్రి కృషి సంచాయోజన క్రింద కామారెడ్డి జిల్లాను చేర్చాలని, వాటర్షెడ్ పథకానికి కామారెడ్డి జిల్లాను అనుసంధానం చేయాలని తీర్మానించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో విద్యుత్తు లైన్లో పెంపునకు అడిగారు. బాయింపల్లి గ్రామంలో రెండు పోల్స్ తాగునీటి కొరకు వేయించాలని ఆదేశించడం అయినది పిట్లం మండలంలో ఒక కిలోమీటర్ రోడ్డు మరమ్మతులు ఫారెస్ట్ అనుమతులు యుద్ధ ప్రాతిపదిగిన పూర్తి చేయాలని, ఫారెస్ట్ డిఎఫ్ఓ ని ఆదేశించడం అయినది. మరియు నేషనల్ హైవే పోచారం అభయారణ్యంలో ఉన్న 1.5 కిలోమీటర్ భూమి ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ కొత్త నేషనల్ హైవే నిర్మాణంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని వారికి నోటీసులు పంపి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రమాద సూచికలు మరియు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం జరిగింది. శివనగర్ సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలన్నారు మరియు ఎన్ హెచ్ 44 4 మండలాలకు ఉపయోగపడే అండర్ ప్రాసెస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. మరియు సదాశివ నగర్ మండలం పోలీస్ స్టేషన్ వద్ద అండర్ ప్రాసెస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి శాసనసభ్యులు కోరడం జరిగినది. 161 హైవే ఎన్వోసీలు ఇప్పించి ఆగిపోయిన భూ నష్టపరిహారం రైతులకు ఇప్పించాలని ఆదేశించడం అయినది. ఎల్లారెడ్డి శాసనసభ్యులు హౌసింగ్ నిర్మాణానికి ఇసుక మొరం ఎలాంటి ఇబ్బందు లేకుండా చూడాలని హౌసింగ్ పీడీకి ఆదేశించడం అయినది మరియు హెల్త్ ప్రైవేట్ హాస్పిటల్స్ పైన నిగు పెంచాలని గ్రామాలలో ప్రబలే సీజన్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు నియంత్రణలు చేపట్టాలని కుటుంబ నియంత్రణ మరియు ఇతర ఆపరేషన్లు నిబంధనలు మేరకు పనిచేసే విధంగా పర్యవేక్షించాలని తెలియజేశారు. ఇట్టి సమాజంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే స్కూల్ టాయిలెట్స్ త్వరితగతిన పూర్తి చేయాలని, ఉపాధి హామీ కింద అంగన్వాడి భవనాలు మరియు గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తామని, ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే పిట్లం రోడ్డు పనులు వేగవంతం చేస్తామని, సేఫ్టీ నిబంధనలు పాటించే విధంగా చూస్తామని ఇట్టి సమావేశంలో విలువైన సూచనలు చేసిన పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అధికారులకు అందరూ కూడా శాఖల వారీగా తీసుకున్న చర్యలు వివరాలను నెక్స్ట్ సమావేశానికి తీసుకురావాలని తెలియజేశారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ సమావేశం వలన ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందని ప్రజలకు మెరుగైన సేవలను మనమందరం అందించాలని అధికారులు అందరూ ఇటివిశాలపై దృష్టి సాధించాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో దిశా కమిటీ సభ్యులు పోగుల కవిత, మరియు నడిపి నగేష్, మరియు జాదవ్ నౌషా నాయక్, మరియు దేశముఖ రాజు, అధికారులు, పాల్గొనడం జరిగినది.