*రిటైర్డ్ ఫిజికల్ టీచర్ శంకరయ్య కు ఘన నివాళులర్పించిన శిష్యులు*
*హుజురాబాద్ జూన్ 29 ప్రశ్న ఆయుధం*
ఎంతోమందికి ఆటపాటల్లో శరీర దారుగ్య విషయంలో మెలుకువలు నేర్పించి ఉన్నత చదువుల కొరకు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి అనేక సార్లు కష్టపడి పని చేసిన ఫిజికల్ టీచర్ కొండపాక శంకరయ్య మృతి చెందగా ఆదివారం రోజున హుజరాబాద్ లోని స్వహగృహంలో తన శిష్య బృందం ఘనంగా నివాళులర్పించారు జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన కొండపాక శంకరయ్య కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గత వారం రోజుల క్రితం మరణించగా ఆదివారం తన ప్రియ శిష్యులు ఘన నివాళులు అర్పించి, తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కొండపాక శంకరయ్య నాటి కరీంనగర్ జిల్లా ఎలుకతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో ఉద్యోగరీత్యా సుమారు 12 సంవత్సరాల పాటు పని చేసి ఆ పాఠశాలలో విద్యనభ్యసించిన నిరుపేద బిడ్డలను కుల, మతాలకతీతంగా గొప్పగా ఎదగాలని ఉన్నత స్థాయి ఎదిగే విధంగా శిక్షణ ఇస్తూ ఎందరో జీవితాలలో వెలుగులు నింపి మరణించడం అత్యంత బాధాకరమని శిష్యులు పేర్కొన్నారు శంకరయ్య వ్యాయామ ఉపాధ్యాయుడే కాకుండా ప్రధానోపాధ్యాయులుగా వివిధ ప్రాంతాలలో విశేషమైన సేవలను అందించి ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలలో విజేతలుగా నిలిపిన ఘనత ఆయనదని పేర్కొన్నారు,
చదువుతో పాటు, క్రమ శిక్షణ తో కూడిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారందరూ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శంకరయ్య శిష్య బృందం వై సరస్వతి, కే. తిరుమల, ఎస్ శ్యామ్ సుందర్, కే. శ్రీనివాస్, కే. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.