*పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నియంత్రణ*
*డాక్టర్ చందన*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 24*
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు నియంత్రణలో ఉంటాయని డాక్టర్ చందన అన్నారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అర్బన్ ఏరియాలోని జమ్మికుంట -1 సబ్ సెంటర్ పరిధిలో లోని ఎంప్లాయిస్ కాలనీలోని 27 వ వార్డ్ లో డాక్టర్ చందన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో 45 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు 5 గురు జ్వర పీడితులను గుర్తించి వారి రక్త నమూనాలను సేకరించి వ్యాధినిర్దారణ కొరకు ల్యాబ్ కి పంపించడం జరిగినదని వ్యక్తి గత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. వైద్య శిబిరాన్ని హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు పరిశీలించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చందన, సూపర్ వైజర్ రత్నకుమారి,డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు సజీదాపర్వీన, రాధ ఆశాకార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.