Site icon PRASHNA AYUDHAM

స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

IMG 20250118 WA0005

మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 18 ప్రశ్నయుధం న్యూస్ డే ‍:  మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆకుల జీవన్ సాయి తన సొంత నిధులతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల జీవన్ సాయి మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యసనం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు.

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేస్తున్న దృశ్యం

 

పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులను ప్రోత్సహించడానికి బ్యాగులు పంపిణీ చేసిన ఆకుల జీవన్ సాయికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Exit mobile version