*పిడిచేడ్ లో భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణీ*
*రామకోటి రామరాజును సన్మానించిన గ్రామస్తులు*
*కళ్యాన తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్నా భక్తులు*
భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ శనివారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గజ్వేల్ మండల పిడిచేడ్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో దగ్గర తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250కిలోల గోటి తలంబ్రాలు అందించామన్నారు. భక్తికీమెచ్చి తిరిగి 100కిలోల తలంబ్రాలు అందించారన్నారు. గోటి తలంబ్రాల్లో పాల్గొన్న వారికి తిరిగి తలంబ్రాలు గ్రామ, గ్రామాన అందిస్తున్నామన్నారు. గోటి తలంబ్రాలు భద్రాచలం అందించిన ఘనత పిడిచేడ్ గ్రామస్తులదే అన్నారు.
తాజా మాజీ సర్పంచ్ G. నాగిరెడ్డి మాట్లాడుతూ గోటి తలంబ్రాలు కల్యానానికి అందించి తిరిగి మళ్ళీ మాకు ఆ రామయ్య కళ్యాన తలంబ్రాలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మమ్మల్ని కూడా రామయ్య సేవలో పాల్గొనేలా చేసిన రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ఆంజనేయులు, పిట్ల రాములు, శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, యాదగిరిరావు, కోటయ్య పాల్గొన్నారు.