Site icon PRASHNA AYUDHAM

దివ్యాంగులకు ఉచితంగా పరికరాల పంపిణ

IMG 20250609 152833

*దివ్యాంగులకు ఉచితంగా పరికరాల పంపిణీ*

*రేపు బ్లాక్ ఆఫీస్ కూడలిలో కార్యక్రమం*

*రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి*

*ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ

షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా దివ్యాంగుల కోసం అవసరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం జూన్ 10వ తేదీ మంగళవారం నాడు బ్లాక్ ఆఫీస్ ముఖ్య కూడలిలో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దివ్యాంగత సర్టిఫికెట్ (సదరం), UDID కార్డు జిరాక్స్ పత్రాలను వెంట తీసుకొని రావాలన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పారదర్శకంగా పరికరాల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు..

Exit mobile version