రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
నిజామాబాద్: గంగాసముందర్ గ్రామం లో ఆదివారం ప్రజా పాలన కార్యక్రమం అంతటా ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ తో పాటు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు సంబంధిత సదుపాయాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, దేగం గంగారెడ్డి, గణేష్ గౌడ్, సుమన్, స్రవంతి, మహిపాల్ చారి, ఎమ్మార్వో, ఎస్ఐ, ఎంపీడీవో, ఏఈఓ, స్థానిక సెక్రటరీ, కారోబారి, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.