ఉప్పల్ లో టీబీ రోగులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ

*ఉప్పల్ లో టీబీ రోగులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ*

మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15

IMG 20250415 WA2043

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ సంస్థ నిక్షయ్ మిత్రాగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమానికి సహకారం అందించింది.

ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ టీబీ డాక్టర్ రాజేశం మాట్లాడుతూ, టీబీ వ్యాధిగ్రస్తులు మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమా గౌరీ మాట్లాడుతూ, క్షయ వ్యాధి నివారణకు ముందస్తు నిర్ధారణ మరియు పూర్తికాలం మందులు వాడటం ఎంతో ముఖ్యమని అన్నారు. జిల్లాలోని 6 టీబీ యూనిట్ల పరిధిలో 750 మంది రోగులకు రెండు నెలలకు సరిపడా 1500 న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతోందని ఆమె వెల్లడించారు.

టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, పౌష్టికాహార కిట్లు అందించిన ప్లాన్ ఇండియా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిక్షయ్ మిత్ర ద్వారా దాతలు ముందుకు వచ్చి టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లు అందించడంలో సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యవతి, పీహెచ్‌సీ ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్యా, ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ స్టేట్ ప్రాజెక్ట్ లీడర్ శ్రీ అభిలాష్, స్టేట్ జాయింట్ డైరెక్టర్ టీబీ సెల్ శ్రీనివాస్, వాసు ప్రసాద్, సూపర్వైజర్ బోగ ప్రకాష్, జిల్లా టీబీ సిబ్బంది మరియు ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment